Nayanthara: 400కోట్ల బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న నయన్.. ఆ సినిమా ఎదో తెలుసా..

Nayanthara: 400కోట్ల బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న నయన్.. ఆ సినిమా ఎదో తెలుసా..


దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. అత్యధిక పారితోషికం తీసుకునే సినీతారలలో ఆమె ఒకరు. ఆమె ఎవరో కాదు నయనతార.. సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ అమ్మడు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ బ్యూటీ, ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత నయనతారకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది నయన్. బడా హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది నయన్.

ఇదిలా ఉంటే నయనతార ఓ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిందట.. ఆమె నో చెప్పడంతో ఆ అవకాశం మరో స్టార్ హీరోయిన్ అందుకొని భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో.? ఆ హీరో ఎవరో.? ఆ సినిమా ఎదో తెలుసా.? నయన్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే నయన్ మిస్ చేసుకున్న సినిమా ఏదంటే.. బాలీవుడ్ లో తెరకెక్కిన చెన్నై ఎక్స్ ప్రెస్. రోహిత్ శెట్టి దర్శకతంలో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా అనుకున్నారట.

చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ తమిళ్ మాట్లాడే యువతిగా కనిపిస్తుంది. దాంతో ఈ సినిమాలో నయనతార అయితే బాగుంటుందని దర్శకుడు భావించాడట. కానీ అదే సమయంలో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచించారట .. అదే సమయంలో ఆమె జీవితంలో కీలక మార్పులు జరుగుతుండటంతో  చెన్నై ఎక్స్ ప్రెస్ ఆఫర్ కు నో చెప్పిందట. ఇక ఈ సినిమాలో నయన్ ప్లేస్ లో దీపికా పదుకొణే అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక షారుక్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా సంచలన విజయం సాధించింది. షారుక్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే దీపికా కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చింది ఈ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *