ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటిస్తోంది.. తాజాగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటిస్తోంది.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలకు, నటులకు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటిస్తున్నారు. ఈ అవార్డులను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) ప్రకటిస్తుంది.. సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డులను రాష్ట్రపతి చేతులు మీదగా గ్రహీతలకు అందజేయనున్నారు. 2023 సంవత్సరంలో తెరకెక్కిన సినిమాల్లో వైవిధ్యం, సృజనాత్మకత, సాంస్కృతిక ప్రాముఖ్యత బట్టి అవార్డులను అందజేస్తారు.