
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ ఇంట్లో 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరి జరిగినట్లు బాధితురాలు సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి పట్టణం కాకర్ల పల్లి రోడ్డులో నివాసం ఉంటున్న నరుకుళ్ల లీలావతి స్నానం చేయాటానికి వెళ్లేముందు మెడలో ఉన్న బంగారు గొలుసు, గాజులు, ముత్యాల హారం తీసి పర్సులో పెట్టి స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఆభరణాలు ఉన్న పర్సు మాయం అయింది. దీంతో మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇది తెలిసిన వారి పనే ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..