IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్పై 59 పరుగుల తేడాతో విజయం సాధించి ముంబై ఇండియన్స్ 11వ సారి ఐపీఎల్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో, పాయింట్ల పట్టికలో టాప్ 2 కోసం రేసులో కొనసాగుతోంది. అయితే, హార్దిక్ పాండ్యా జట్టు మూడు జట్ల సవాలును ఎదుర్కొంటున్నందున, టాప్ 2 కు చేరుకునే ప్రయాణం ముంబైకి కొంచెం కష్టంగా ఉంటుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు క్వాలిఫైయర్ వన్ ఆడతాయి. ఫైనల్కు చేరుకోవడానికి వారికి రెండు అవకాశాలు లభిస్తాయి. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ నుంచి కనీసం రెండు జట్లను ఓడించవలసి ఉంటుంది. ఇది చాలా కష్టంగా కనిపిస్తుంది.
అయితే, ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబైకి ఇది అసాధ్యం కాదు. మే 26న జైపూర్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. 18 పాయింట్లను చేరుకోవడానికి, అలాగే టాప్-2 ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి ఆ జట్టుకు సులభమైన విజయం అవసరం. ముంబై ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉంది. కానీ, టాప్ 4 జట్లలో అత్యుత్తమ నెట్ రన్ రేట్ (+1.292) కలిగి ఉంది. ఒకటి కంటే ఎక్కువ జట్లు 18 పాయింట్లు సాధిస్తే అది ముఖ్యమైనదిగా నిరూపించబడుతుంది.
టాప్ 2 కి చేరుకోవడానికి సమీకరణం..
ముంబై రెండవ స్థానానికి చేరుకోవాలంటే, ఆర్సీబీ తన మిగిలిన రెండు మ్యాచ్లను, మే 23న సన్రైజర్స్ హైదరాబాద్తో, మే 27న లక్నో సూపర్ జెయింట్స్తో ఓడిపోవాలి. బెంగళూరు ఫలితం ముంబై అవకాశాలను ప్రభావితం చేస్తుంది. పంజాబ్ కూడా 17 పాయింట్లతో ఉంది. మే 24న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. మే 26న ముంబై, పంజాబ్ తలపడతాయి. ఇటువంటి పరిస్థితిలో, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోతే, మే 26న జరిగే మ్యాచ్ అగ్ర రెండు జట్లకు ఒక రకమైన ఎలిమినేటర్ లాంటిది. పంజాబ్ను టాప్ 2 రేసు నుంచి బయటకు పంపాలంటే ముంబై భారీ విజయం సాధించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్లో స్థానం ఖాయం అయినప్పటికీ, పాయింట్ల పట్టికలో ఈస్థానంతో ఎలిమినేటర్ 1లో ఆడతారా లేదా క్వాలిఫయర్ 1లో ఆడతారా అనేది నిర్ణయిస్తుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..