Gold Loan Rules: మీరు గోల్డ్ లోన్‌ తీసుకుంటున్నారా? ఆర్బీఐ మీకో గుడ్‌న్యూస్‌..!

Gold Loan Rules: మీరు గోల్డ్ లోన్‌ తీసుకుంటున్నారా? ఆర్బీఐ మీకో గుడ్‌న్యూస్‌..!


RBI Gold Loan Rules: చిన్న రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో (MSME) సంబంధం ఉన్న వ్యక్తులకు రుణాలు తీసుకోవడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద ఉపశమనం కల్పించింది. ఆర్బీఐ కొత్త సూచనల ప్రకారం, ఇప్పుడు రుణం తీసుకునే వ్యక్తి బ్యాంకు వ్యవసాయం, MSME రుణం కోసం బంగారం లేదా వెండిని తాకట్టు పెడితే ఆ రుణం హామీ లేని రుణంగా పరిగణిస్తారు.

ఈ సౌకర్యం స్వచ్ఛందంగా ఆభరణాలను తాకట్టు పెట్టినప్పుడు మాత్రమే వర్తిస్తుందని RBI స్పష్టం చేసింది. అంటే, బ్యాంకులు ఏ రుణగ్రహీతను ఆభరణాలను తాకట్టు పెట్టమని బలవంతం చేయలేవు. కానీ ఒక వ్యక్తి తన ఆభరణాలను తాకట్టు పెట్టాలనుకుంటే బ్యాంకులు దానిని అంగీకరించవచ్చు. ఆర్బీఐ తాజాగా వ్యవసాయం, చిన్న వ్యాపార రుణాలకు బంగారం లేదా వెండి ఆభరణాలను కోలేటరల్ ఫ్రీ లిమిట్ కింద స్వచ్ఛందంగా తాకట్టు పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది.

ఇది కూడా చదవండి: Indian Railways: ప్రతి బోగీలో కట్టలు కట్టలు నోట్లు.. దేశంలో ఏకైక రైలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

కోలేటరల్ ఫ్రీ లిమిట్ వరకు రుణ గ్రహీతలు స్వచ్ఛందంగా గోల్డ్ లేదా సిల్వర్ తనఖా పెట్టి రుణాలు పొందవచ్చు. వీళ్లకు బ్యాంకులు లోన్స్ మంజూరు చేయవచ్చు. వ్యవసాయానికి రుణ మంజూరుపై డిసెంబర్ 2024లో జారీ చేసిన మునుపటి సూచనలను , MSMEలకు రుణాలు ఇవ్వడంపై మాస్టర్ డైరెక్షన్‌ను ఈ వివరణ సూచిస్తుంది

రైతులకు రుణాలు పొందడం సులభం:

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో బంగారం, వెండిని అత్యంత నగదు మార్పిడికి అనువైన ఆస్తులుగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ ఆభరణాలను రుణాల కోసం ఉపయోగించవచ్చు. ఇది రుణ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తుంది. రుణగ్రహీతలు వడ్డీ వ్యాపారులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు.

ఇది కూడా చదవండి: Fact Check: సెప్టెంబర్‌ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన

2023 సంవత్సరంలో కూడా రుణానికి బదులుగా నగలు తీసుకున్నట్లయితే దానిని ‘బంగారు రుణం’ వర్గంలోనే ఉంచాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అయితే దీనిలో సమస్య ఏమిటంటే బంగారు రుణాలకు కఠినమైన నియమాలు వర్తిస్తాయి. అయితే వ్యవసాయానికి సంబంధించిన రుణాలు సాధారణంగా సీజన్ ప్రకారం కొంత సడలింపును పొందుతాయి. ఫలితంగా ప్రభుత్వ బ్యాంకులలో బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో దాదాపు రెట్టింపు అయింది. కానీ రైతులకు రుణాలు పొందడంలో ఇబ్బందులు పెరిగాయి.

బ్యాంకులు ఎలా ప్రయోజనం పొందుతాయి?

కొత్త నియమం ప్రకారం.. బ్యాంకులు రుణాలు ఇవ్వడం సురక్షితంగా చేస్తుంది. ఎందుకంటే వాటికి ఆభరణాల రూపంలో దృఢమైన హామీ లభిస్తుంది. ఇది గతంలో రిస్క్ ఎక్కువగా ఉండే వర్గాలలో మరింత నమ్మకంగా రుణాలు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది.

ఇది కూడా చదవండి: ఇది కూడా చదవండి: Gold Price: సామాన్యులకు శుభవార్త.. బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయా?

ఇది కూడా చదవండి: Auto News: ఈ బైక్‌ ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. ఫీచర్స్‌, ధర ఎంతో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *