BSNL: లాభాల బాటలో బీఎస్‌ఎన్‌ఎల్‌.. 18 ఏళ్ల తర్వాత వరుసగా రెండు సారి..

BSNL: లాభాల బాటలో బీఎస్‌ఎన్‌ఎల్‌.. 18 ఏళ్ల తర్వాత వరుసగా రెండు సారి..


ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ లాభాల బాటలో కొనసాగుతోంది. మార్చి 31, 2025 తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 280 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని, ఇది వరుసగా రెండవ త్రైమాసిక లాభాన్ని నమోదు చేసిందని కంపెనీ మంగళవారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్‌ చేశారు.

గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 849 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది . “18 సంవత్సరాలలో మొదటిసారిగా, వరుసగా త్రైమాసిక లాభాలు, నికర లాభాలు, నిర్వహణ లాభం మాత్రమే కాదు, సానుకూల మార్జిన్ కూడా కాదు, కానీ 2007 తర్వాత వరుసగా రెండవసారి త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం” అని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మూడవ త్రైమాసికంలో కంపెనీ పన్ను తర్వాత రూ. 262 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. వరుసగా లాభాలను నమోదు చేయడంతో 2025 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నష్టం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,370 కోట్ల నుండి రూ.2,247 కోట్లకు తగ్గిందని BSNL తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరానికి BSNL నిర్వహణ ఆదాయం 7.8 శాతం పెరిగి రూ. 20,841 కోట్లకు చేరుకుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏ. రాబడర్ట్‌ జే రవి అన్నారు. ఇది FY24లో రూ. 19,330 కోట్లుగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Vodafone Idea: వొడాఫోన్ ఐడియా బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం అవుతుందా?

క్రమశిక్షణతో కూడిన వ్యయ నియంత్రణ, వేగవంతమైన 4G/5G విస్తరణతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ వృద్ధి పథాన్ని నిలబెట్టుకోవడంలో, ప్రతి భారతీయుడికి సరసమైన, అధిక-నాణ్యత కనెక్టివిటీని అందించడంలో నమ్మకంగా ఉందని రవి అన్నారు. లాభాలను మా అంతిమ లక్ష్యంగా వెంబడించడం లేదు. ప్రజా సేవలో టెలికాం శ్రేష్ఠతను మేము పునర్నిర్వచించుకుంటాము. మనం నిరంతరం సరైన పనులు చేసినప్పుడు – అద్భుతమైన సేవలను అందించడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.

ఇది కూడా చదవండి: Tech News: మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు మైక్రోఫోన్‌లు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *