బల్గేరియాకు చెందిన బాబా వంగా.. ఆమె చిన్నప్పుడే చూపు కోల్పోయింది. అయినా ఈమె భవిష్యత్తులో జరగబోయే ప్రకృతి విపత్తులు వంటి వాటిని అంచనా వేసి భవిష్యవాణి వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు చెప్పిన చాలా విషయాలు నిజంగా జరిగాయి. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ప్రపంచ యుద్ధాల వంటి వాటి గురించి ఈమె జోస్యం చెప్పింది. అయితే కరోనా అనే వ్యాది కూడా ప్రపంచాన్ని వణికిస్తుందని ఆమె ముందే చెప్పారు. అమె చెప్పినట్టుగానే కరోనా వచ్చిన ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఈమె చెప్పే జోస్యాన్ని చాలా వరకు జనాలు నమ్ముతారు.
బాబా వంగా ఏం చెప్పింది..
అయితే 2025లో ఏ పెను విపత్తు సంభవించబోతున్నట్లు ఈమె ఇటీవలే జోస్యం చెప్పింది. ఆ విపత్తు ప్రంచాన్ని కుదిపేసే స్థాయిలో ఉంటుందని తెలిపింది. దీంతో ఆమె చెప్పిన జోష్యాలను నమ్మే అభిమానులు, ఆమె అనుచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే పెను విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పినప్పటికీ అది ఏ రూపంలో వస్తుందో అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేనట్టు తెలుస్తోంది. అంటే అది ప్రపంచ యుద్ధమా? ప్రకృతి విలయాలా? లేక ఆర్థిక పరంగా నష్టపోవడమా అనేది దానిపై లేదు. అయినా కూడా ఆమెను నమ్మె కొందరు ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు.
బాబా వంగా భవిష్యవాణులు తరచూ అస్పష్టంగా ఉంటాయని, వాటిని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని విమర్శకులు అంటారు. ఆమె జోస్యాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని, కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా సరిపోలినవిగా భావిస్తారు. అయితే ఈ జోస్యాలు చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాటి ఖచ్చితత్వం గురించి సందేహాలు ఉన్నాయి. ఈ భవిష్యవాణులు నిజమవుతాయో లేదో తెలియాలంటే 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు చూడాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..