కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. గురువారం(మే 15) ఆయన బాదామి బాగ్ కంటోన్మెంట్ కు వెళతారు. జమ్ము కశ్మీర్లో తాజా పరిస్థితి ఏంటి? ఇక ముందు చేపటాల్సిన చర్యల గురించి సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్లో భారత సైన్యం నిర్వహించిన ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజ్నాథ్ సింగ్ కాశ్మీర్ లోయకు చేసిన మొదటి పర్యటన ఇది.
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్ పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. శ్రీనగర్ పర్యటన సందర్భంగా, రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ సైనిక అధికారులతో చర్చలు జరుపుతారు. శ్రీనగర్లో తన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత, రాజ్నాథ్ సింగ్ గురువారం సాయంత్రం న్యూఢిల్లీకి బయలుదేరుతారు.
జమ్మూ కాశ్మీర్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలలు మే 15న తిరిగి తెరవడం జరుగుతుందని జమ్మూలోని పాఠశాల విద్యా డైరెక్టరేట్ బుధవారం ప్రకటించింది. ఈ వార్త విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే విషయం. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య, జమ్మూలోని సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలలో మే 15 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజా మామూలు పరిస్థితులు నెలకొనడంతో తిరిగి ప్రారంభిస్తున్నట్లు విద్య శాఖ తెలిపింది.
అదేవిధంగా, రాజౌరి, పీరీ, కలకోటే, తన్మండి, మొగ్లా, కొట్రంక, ఖవాస్, లోయర్ హతల్, దర్హాల్ ప్రాంతాల్లో కూడా పాఠశాలలు చాలా రోజుల తర్వాత తెరుచుకున్నాయి. పూంచ్లోని సురాన్కోట్, బుఫ్లియాజ్లలో కూడా, పరిస్థితి మెరుగుపడిన తర్వాత మే 15 నుండి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లగలిగారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..