RR vs CSK: ఐపీఎల్-2025 11వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37 పరుగులు, సంజు సామ్సన్ 20 పరుగులు చేశారు. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీష్ పతిరానా తలా 2 వికెట్లు పడగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..