సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అనేక సవాళ్లు, కష్టాలను భరించి ఇండస్ట్రీలో నటిగా ప్రత్యేక ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె చేసిన పొరపాటు.. జైలుకు వెళ్లేలా చేసింది. దీంతో కెరీర్ నాశనం అయ్యింది. 23 ఏళ్ల వయసుకే ఆమె సినీ ప్రయాణం ఆగిపోయింది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కానీ కావాల్సినంత క్రేజ్ మాత్రం రావట్లేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? బాలనటిగా తన మొదటి సినిమాతో ఉత్తమ నటి అవార్డ్ అందుకుంది. 17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.. కానీ ఊహించని రీతిలో 23 ఏళ్ల వయసులోనే కెరీర్ క్లోజ్ అయ్యింది. ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. బ్యూటీ శ్వేత బసు ప్రసాద్.
చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేసింది. మగ్దీ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఆ తర్వాత ‘ఇక్బాల్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తమిలంలో రారా, చందమామ చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో కొత్త బంగారు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. దీంతో ఈ బ్యూటికి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
కానీ ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కాగా.. మిగతా సినిమాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి. అదే సమయంలో 2014లో హైదరాబాద్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు ఆమె పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ లోని నాంపల్లి సెషన్స్ కోర్టు శ్వేతను నిర్దోషిగా ప్రకటించింది. ఆమె గురించి వచ్చిన రూమర్స్ అన్ని తప్పుగా నిర్దారించింది. ఆ తర్వాత తన స్నేహితుడు రోహిత్ ను పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉన్న శ్వేత బసు ప్రసాద్ ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..