గంగా నది ప్రధాన ఉపనదులలో యమునా, ఘఘ్రా, కోసి, గండక్, సన్, చంబల్ ఉన్నాయి. సింధు నదికి ప్రధాన ఉపనదులు చీనాబ్, సట్లెజ్, బియాస్, రావి నదులు ఉన్నాయి. భారత్ – పాకిస్తాన్లలో దాదాపు 30 కోట్ల మంది సింధు నదీ పరీవాహక ప్రాంతంపై, భారతదేశం- బంగ్లాదేశ్లలో దాదాపు 40 కోట్ల మంది గంగా నదీ పరీవాహక ప్రాంతంపై ఆధారపడి ఉన్నారు.