WTC 2027: అంతా మర్చిపోయారు.. కట్‌చేస్తే.. సెలెక్టర్ల షాకింగ్ డెసిషన్.. 6 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ

WTC 2027: అంతా మర్చిపోయారు.. కట్‌చేస్తే.. సెలెక్టర్ల షాకింగ్ డెసిషన్.. 6 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ


Sri Lanka vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జూన్ 17 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం శ్రీలంక క్రికెట్ (SLC) తమ 18 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో కీలక అంశం, ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్టరీ స్పిన్నర్ అఖిల ధనంజయ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం. గత 6 సంవత్సరాలలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడని అఖిల ధనంజయని కూడా ఎంపిక చేశారు. ధనంజయ డి సిల్వా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు. 2025-2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో శ్రీలంకకు ఇదే తొలి సిరీస్ కావడంతో, జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అనుభవజ్ఞుడైన ఆల్-రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు ఇది చివరి టెస్ట్ మ్యాచ్ కానుంది. 2009లో గాలేలోనే తన టెస్ట్ అరంగేట్రం చేసిన మాథ్యూస్, అదే వేదికపై తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలకనుండటం విశేషం.

అఖిల ధనంజయ రీ-ఎంట్రీ..

31 ఏళ్ల అఖిల ధనంజయ, 2019లో న్యూజిలాండ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడంతో కొంతకాలం జట్టుకు దూరమైనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి తిరిగి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా, ఇటీవలే ముగిసిన నేషనల్ సూపర్ లీగ్ 4-రోజుల టోర్నమెంట్‌లో 9 ఇన్నింగ్స్‌లలో 37 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. లెగ్ బ్రేక్, గూగ్లీ, క్యారమ్ బాల్, దూస్రా వంటి వైవిధ్యమైన బంతులు వేయగల సామర్థ్యం ఉన్న ధనంజయ రాకతో శ్రీలంక స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది.

ఇవి కూడా చదవండి

యువకులకు అవకాశం, సీనియర్లపై వేటు..

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సెలెక్టర్లు పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా టెస్టు జట్టులో అవకాశం కల్పించారు. పసిందు సూరియబండార, పవన్ రత్నాయకే, ఇసిత విజేసుందర వంటి అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన గత సిరీస్‌లో విఫలమైన సదీర సమరవిక్రమ, రమేష్ మెండిస్, విశ్వ ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే వంటి ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించారు.

అఖిల దనంజయ టెస్ట్ కెరీర్..

అకిల ధనంజయ 2018 సంవత్సరంలో శ్రీలంక తరపున తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అదే సమయంలో, అతను చివరిసారిగా 2019 సంవత్సరంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాడు. ఈ సమయంలో, అకిల ధనంజయ శ్రీలంక తరపున మొత్తం 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 24.81 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనతను 4 సార్లు సాధించాడు. ఇప్పుడు అకిల ధనంజయ బలమైన పునరాగమనం కోసం చూస్తున్నాడు. అయితే, అతనికి ప్లేయింగ్ 11లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టు:

ధనంజయ డి సిల్వా (కెప్టెన్), పాతుమ్ నిస్సంక, ఒషాడ ఫెర్నాండో, లహిరు ఉడార, దినేష్ చండిమల్, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, పసిందు సూరియబండార, సోనాల్ దినూష, పవన్ రత్నాయకే, ప్రభాత్ జయసూర్య, తరిందు రత్నాయకే, అఖిల ధనంజయ, మిలన్ రత్నాయకే, ఫెర్నాండో, కసున్ రజిత, ఇసిత విజేసుందర.

గాలే స్పిన్‌కు అనుకూలించే పిచ్ కావడంతో, ప్రభాత్ జయసూర్య, అఖిల ధనంజయ, తరిందు రత్నాయకేలతో కూడిన స్పిన్ త్రయం బంగ్లాదేశ్ బ్యాటర్లకు గట్టి సవాలు విసిరే అవకాశం ఉంది. ఈ సిరీస్‌తో ఇరు జట్లు తమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించాలని చూస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *