ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతుంటారు హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోవడంతో పరాయి బాషల నుంచి కూడా హీరోయిన్స్ మన దగ్గర సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది భామలు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వారిలానే ఇప్పుడు ఓ భామ కూడా టాలీవుడ్ లోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇస్తుంది. అంతకు ముందు ఆమె విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలి కానీ అది కుదరలేదు.. కట్ చేస్తే ఇప్పుడు బడా హీరో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇస్తుంది.. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2013 సంవత్సరంలో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నటి మాళవిక మోహనన్. ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం కానుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్
ఇదిలా ఉంటే మాళవిక మోహన్ ముందుగా విజయ్ దేవరకొండ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. విజయ్ దేవరకొండ హీరోగా హీరో అనే సినిమా చేయాల్సి ఉంది.. కానీ ఆ సినిమా సగం షూటింగ్ జరుపుకున్న ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఆతర్వాత చాలా కాలం ఎదురుచూసిన మాళవికాకు ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఛాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమా టాలివుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మాళవిక భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు.
ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.