ఒక ఖడ్గమృగం పర్యాటకుల వైపుకు దూసుకొచ్చింది. అంతటితో ఆగకుండా పర్యాటకులున్న వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని ముందుకు వెనక్కు లాగుతూ వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. ఖడ్గమృగం అలా దాడి చేయడంతో పర్యాటకులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం కొద్దిసేపటికే ఖడ్గమృగం అక్కడినుంచి వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే పర్యాటకులపై ఖడ్గమృగాలు ఇలా దాడి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నేషనల్ పార్క్ లో సఫారీకి వెళ్ళిన పర్యాటకుల జీపులపై పలుమార్లు దాడికి యత్నించాయి. కిలోమీటర్ల వరకు వెంబడించి భయాన్ని సృష్టించాయి.
మరిన్ని వీడియోల కోసం :