నిద్రమేల్కొని చూసేసరికి రైలు ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాకు చేరుకుంది. అయితే ఆ సమయంలో సంజయ్కు తన ఇంటి అడ్రస్ గుర్తుకు రాలేదు. దీంతో ఎటూ వెళ్లలేక అక్కడే ఉండిపోయాడు. తొమ్మిదేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు గూగుల్ మ్యాప్స్ సాయంతో 38 ఏళ్ల ఏజ్లో తన ఇంటికి చేరుకున్నాడు. 29 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు చేరాడు. ఈ ఘటన హర్యాలోని అంబాలాలో జరిగింది. అసలేం జరిగిందంటే? అంబాలా కాంట్లోని కబీర్ నగర్కు చెందిన సంజయ్ తొమ్మిదేళ్ల వయసులో ఆడుకుంటూ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ సరదాగా రైలు ఎక్కి నిద్రలోకి జారుకున్నాడు. నిద్రమేల్కొని చూసేసరికి రైలు ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాకు చేరుకుంది. అయితే ఆ సమయంలో సంజయ్కు తన ఇంటి అడ్రస్ గుర్తుకు రాలేదు. దీంతో ఎటూ వెళ్లలేక అక్కడే ఉండిపోయాడు. అయితే, ఒకరోజు సంజయ్కు అంబాలాలోని తన ఇంటి దగ్గర ఒక పోలీస్ పోస్ట్, దాని ముందు ఒక దర్గా ఉందని గుర్తుకొచ్చింది. దాని కోసం గూగుల్లో వెతకడం ప్రారంభించాడు. గూగుల్ మ్యాప్స్ ద్వారా తన స్వగ్రామంలోని తన ఇంటిని గుర్తించాడు. గ్రామానికి వెళ్లి తన ఇంటిని వెతుకుతున్న సమయంలోనే వీణ అనే మహిళ ఎవరి కోసం వెతుకుతున్నావని సంజయ్ను అడిగింది. అప్పుడు తన తండ్రి పేరు కరం పాల్ అని, తల్లి పేరు వీణ అని ఆమెకు సంజయ్ చెప్పాడు. చిన్న వయసులోనే ఇంటి నుంచి తప్పిపోయానని చెప్పాడు. అయితే వీణ అతని మాటలను నమ్మలేదు. సంజయ్ మొబైల్ నంబర్ తీసుకుంది. దీంతో అక్కడి నుంచి సంజయ్ వెళ్లిపోయాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేద పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేతులెత్తి మొక్కే నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్
చిరు సర్ప్రైజ్ గిఫ్ట్…ఎమోషనల్ అయిన డైరెక్టర్
720 మందితో కైలాస మానస సరోవర యాత్ర.. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి షురూ..
మహిళ అస్థిపంజరాన్ని తవ్వి తీసి.. సెల్ఫీ తీసుకున్న వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే..
ఐదు రోజుల్లో ఎవరెస్ట్ ఎక్కేసారు! యమా స్పీడ్గా ఎలా అంటే ..