అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలోని వెంకటాపురంలో ఓ రైతు తన పొలంలో షెడ్డు వేసి అందులో కోళ్లు పక్షులు పెంపకానికి సిద్ధమయ్యాడు. షెడ్డు చుట్టూ ఇతర జంతువులు పక్షులు చొరబడకుండా వలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి పనుల నిమిత్తం షెడ్డు వద్దకు వెళ్లిన ఆ రైతుకు ఆ వల దగ్గర నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని చుట్టుపక్కల అంతా వెతికాడు. వలలో చిక్కుకున్న భారీ జెర్రిపోతును చూసి షాకయ్యాడు. విషయం తెలిసి చుట్టుపక్కలవాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. సుమారు 10 అడుగుల పొడవుతో, బంగారు వర్ణంలో ఉన్న ఆ భారీ జెర్రిపోతును చూసి అంతా ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం :