Headlines

కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం వీడియో

కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం వీడియో


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం గ్రామానికి చెందిన బానోతు మోహిలాల్, కళ్యాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె సింధును టేకులపల్లి మండలానికి చెందిన బాలాజీ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇంటి దగ్గరే జరిగిన వివాహం బంధుమిత్రులతో కలకలలాడింది. ఆగస్టు 17, ఆదివారం ఉదయం వివాహం జరిగింది. సాయంత్రం తన కూతురు సింధును వియ్యాలవారికి అప్పగింతలు చేస్తున్న తరుణంలో సింధు తల్లి కళ్యాణి తన కూతురు తనకు దూరమవుతుందన్న భావోద్వేగంతో హఠాత్తుగా కుప్పకూలిపోయింది.దీంతో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కళ్యాణిని పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించిందని నిర్ధారించారు. ఊహించని ఘటనతో పెళ్లింట విషాదం నిండిపోయింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో ఆనందంలో మునిగితేలుతున్న వేడుకల వాతావరణం మాయమైంది. ఈ హృదయ విదారకమైన సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది.

మరిన్ని వీడియోల కోసం :

వామ్మో ఇవేం పాములురో బాబు.. కుప్పలు కుప్పలుగా వీడియో

పుట్టగొడుగుల కూర తిన్న జంట.. కాసేపటికే విషాదం వీడియో

అడవిలో అద్భుతం.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో

కొండచిలువలను వేటాడటంలో క్వీన్‌.. పదిరోజుల్లో ఏకంగా..

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *