ఈ ఆలయం 17 దోచుకోబడి ధ్వసం చేసినా.. నేటికీ అందంగా ఠీవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న శివయ్య..

ఈ ఆలయం 17 దోచుకోబడి ధ్వసం చేసినా.. నేటికీ అందంగా ఠీవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న శివయ్య..


ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సోమనాథ ఆలయం ఒకటి. ఈ ఆలయం గురించి ప్రస్తావరణ రాగానే ప్రజలందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఈ ఆలయాన్ని చాలాసార్లు దోచుకుని నాశనం చేశారన్న విషయం. ఈ ఆలయం చాలాసార్లు నాశనం చేయబడింది. ధ్వసం చేసి మరీ దోచుకున్నారు. అయినా నేటికీ ఈ ఆలయ వైభవం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ ఆలయంపై జరిగిన దాడుల గురించి అనేక నివేదికలు, వాస్తవాలు ఉన్నాయి. ఈ ఆలయం ధ్వసం చేయబడిన ప్రతిసారీ పునర్నిర్మించబడిందనేది కూడా వాస్తవం. నిజానికి ఈ ఆలయం నిర్మాణం వెనుక పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రోజు మనం ఆలయ చరిత్ర గురించి.. ఈ ఆలయం ఎన్నిసార్లు ధ్వసం చేయబడిందో తెలుసుకుందాం..

సోమనాథ ఆలయ చరిత్ర
గుజరాత్‌లో ఉన్న సోమనాథ్ ఆలయాన్ని సోమ ప్రభువు (చంద్రుడు) బంగారంతో, రవి వెండితో, శ్రీ కృష్ణుడు గంధపు చెక్కతో, భీమ్‌దేవ రాజు రాళ్లతో నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయాన్ని నాలుగు దశల్లో నిర్మించారు. చారిత్రక వాస్తవాల ప్రకారం 11 నుంచి 18వ శతాబ్దంలో అనేక మంది ముస్లిం ఆక్రమణదారులు, పోర్చుగీసు వారిచే పదేపదే నాశనం చేయబడింది. ఇలా జరిగిన ప్రతిసారీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.

సోమనాథ ఆలయం 17 సార్లు ద్వసం

ఇవి కూడా చదవండి

ఒక నివేదిక ప్రకారం మహమూద్ ఘజ్నవి సోమనాథ్ ఆలయంపై దాడి చేసి దానిని పగలగొట్టి సంపదనంతా దోచుకున్నారు. తరువాత గుజరాత్ రాజు భీముడు, మాల్వా రాజు భోజ్ ఈ సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. 1297లో ఢిల్లీ సుల్తాన్ గుజరాత్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత సోమనాథ ఆలయం కూడా ధ్వంసం చేయబడింది.

సోమనాథ్‌లోని రెండవ శివాలయాన్ని వల్లభి యాదవ రాజులు క్రీ.శ. 649లో నిర్మించారు. దీనిని సింధ్ గవర్నర్ అల్-జునైద్ క్రీ.శ. 725లో ధ్వంసం చేశారు. సోమనాథ్ ఆలయం 17 సార్లు ధ్వంసం చేయబడిందని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రతిసారీ పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న సోమనాథ్ ఆలయాన్ని చౌలుక్య శైలిలో పునర్నిర్మించబడింది. మే 1951లో పూర్తయింది. ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్తి చేశారు.

ఇది మొట్టమొదటి,పురాతనమైన జ్యోతిర్లింగం.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ సోమనాథ్ ఆలయం అత్యంత పురాతన జ్యోతిర్లింగం. ఇది 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది. దీనిని ప్రభాస్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం గురించి స్కంద పురాణం, శ్రీమద్ భగవత్, శివ పురాణం వంటి పురాతన గ్రంథాలలో వివరించబడింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *